కాజల్ అగర్వాల్ పెళ్లి తరవాత నటించబోతున్న మొట్టమొదటి సినిమా ఇదే.. భర్త కి స్క్రిప్ట్ వినిపించింది.

కాజల్ అగర్వాల్ పెళ్ళి తర్వాత సినిమాలు మానేస్తుందని ప్రచారం చేసిన వాళ్ళకి గట్టి షాకిచ్చింది. పెళ్ళి తర్వాత మొట్ట మొదటి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరు ఆశ్చర్యపోయేలా చేసింది. ఇండస్ట్రీలో అందరికీ హీరోయిన్ పెళ్ళి చేసుకుంటే ఇక మళ్ళీ కనిపించదన్న భావన ఎప్పటి నుంచో ఉంది. చాలామంది హీరోయిన్స్ పెళ్ళి చేసుకొని హీరోయిన్ కెరీర్ కి గుడ్ బాయ్ చెప్పేస్తారు. కొంత కాలం భర్త.. పిల్లలతో సంసార జీవితాన్ని ఎంజాయ్ చేశాక ఏ అత్త క్యారెక్టర్స్ కో లేక అక్క.. వదిన క్యారెక్టర్స్ లోనో నటించే అవకాశాలొస్తే మళ్ళీ మొహానికి మేకప్ వేసుకుంటారు. ఇక ప్రియమణి లాంటి వాళ్ళైతే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటారు.

కాని కాజల్ అగర్వాల్ మాత్రం పెళ్ళి కి ముందు పెళ్ళి కి తర్వాత సినిమాల విషయంలో ఒకేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తుంది కాజల్ అగర్వాల్. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది. అలాగే మంచు విష్ణు తో మోసగాళ్ళు అన్న పాన్ ఇండియన్ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో విష్ణు కి సిస్టర్ గా కాజల్ నటిస్తుండటం విశేషం. అలాగే హిందీలో ముంబై సాగా.. తమిళం తో పాటు అన్నీ ప్రధాన భాషల్లో రిలీజ్ అయ్యే పాన్ ఇండియన్ సినిమా ఇండియన్ 2 లో నటిస్తోంది.

కాగా తాజాగా కొరియో గ్రాఫర్.. డైరెక్టర్ ప్రభుదేవా కి జంటగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది కాజల్ అగర్వాల్. ఈ సినిమా సమ్మర్ నుచి సెట్స్ మీదకి వెళ్ళబోతుండగా కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో గాని లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోగాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తునారట మేకర్స్. ఇక పెళ్ళి తర్వాత నటించబోతున్న ఈ సినిమా కథ కాజల్ అగర్వాల్ భర్త గౌత కిచ్లు కూడా విన్నాడట. మొత్తానికి పెళ్ళి తర్వాత కాజల్ అగర్వాల్ కథల ఎంపికలో భర్త సహాయ కూడా తీసుకుంటోంది.