మల్టీస్టారర్‌పై ‘జవాన్‌’ దర్శకుడు అట్లీ కన్ను!

‘జవాన్‌’తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించిన దర్శకుడు అట్లీ ప్రస్తుతం తదుపరి చిత్రం గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళపతి విజయ్‌, షారుక్‌తో ఓ మల్టీస్టారర్‌ చిత్రం తీసేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్‌ సినిమాకు సంబంధించిన స్కిప్ట్‌ వర్క్‌తో బిజీగా ఉన్నాం.

త్వరలోనే ఇది తెరకెక్కే అవకాశాలున్నాయి. తాజాగా ఓ పార్టీలో విజయ్‌, షారుక్‌ ఖాన్‌ నా సినిమాల గురించి మాట్లాడుకొని నాకు ఫోన్‌ చేశారు. మల్టీస్టారర్‌ తీసే ఆలోచన ఉంటే.. అందులో తాను నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు షారుక్‌ చెప్పారు. అలాగే విజయ్‌ కూడా ఇదే మాట అన్నారు.

అందుకే వాళ్లిద్దరితో ఓ మల్టీస్టారర్‌ చేయాలని నిర్ణయించుకున్నా. ఇదే నా తదుపరి చిత్రం అవుతుంది. రూ.3000 కోట్లు వసూళ్లు చేసే చిత్రమవుతుంది. ఈ ఇద్దరిలో ఎవరు ముఖ్యమంటే నేను చెప్పలేను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి తొలి కారణం విజయ్‌.. నాపై నమ్మకంతో అవకాశాలిచ్చారని అట్లీ అన్నారు. అంతేకాదు హాలీవుడ్‌ నుంచి ఓ ప్రముఖ స్టూడియో తనను సంప్రదించినట్లు, ప్రస్తుతం ఆ పనులు కూడా జరుగుతున్నట్లు అట్లీ చెప్పారు.