Anchor Suma: పంచ్ ప్రసాద్‌కే కౌంటర్ ఇచ్చిన జాతిరత్నం…!

Anchor Suma: దాదాపు గత 9 ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ అశేష పాపులారిటీని సొంతం చేసుకున్న కామెడీ షో జబర్దస్త్. ఈ షో వల్ల ఎంతో మంది జీవితాలే మారిపోయాయి. ఎక్కడో ఆగిపోయిన తమ టాలెంట్‌ను ఈ రోజు ఇలా ప్రపంచానికి తెలిసే అవకాశం ఇచ్చిన కార్యక్రమ నిర్వాహకులు చేసిన కృషి ఎనలేనిది. కాగా ఈ షోకు న్యాయనిర్ణేతలు గా ప్రారంభం నుంచీ నాగబాబు, రోజా వ్యవహరిస్తుండగా, నాగబాబు కొన్ని అనివార్య కారణాల వల్ల షో నుంచి వైదొలగడం జరిగింది. కానీ రోజా మాత్రం ఇప్పటికీ జడ్జ్‌గా ఉంటూ, కంటెస్టంట్స్ చేసే స్కిట్స్‌కు మధ్య మధ్యలో పంచ్‌లు వేస్తూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

అయితే జబర్దస్త్‌లో చేయడం వల్ల అందులోని కమెడియన్స్‌కు వేరే ఛానెల్లలోనూ పలు పోగ్రామ్స్‌ చేసే అవకాశం రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఈ కమెడియన్స్‌లో ముఖ్యంగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది తమ కామెడీతో అలరిస్తూ భారీ స్థాయిలో ఆదరాభిమానాలను కూడగట్టుకున్నారు. వీళ్లే కాకుండా చమ్మక్ చంద్ర, చంటి, ప్రసాద్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్‌ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. అందులో పంచ్ ప్రసాద్ వేసే పంచులకు ఎవ్వరైనా నవ్వాల్సిందే. అతనికి అనారోగ్యం రిత్యా కొన్నాళ్లు షోకు దూరమైనా మళ్లీ అంతా సర్దుకోవడంతో ఇప్పుడు మళ్లీ తన పంచ్‌లను విసురుతూ నవ్విస్తున్నారు.

ఇక ఇప్పటికే పలు ప్రోగ్రామ్స్‌లలో నవ్విస్తున్న ప్రసాద్, కొత్తగా శ్రీముఖి హోస్ట్‌గా చేస్తోన్న జాతి రత్నాలు అనే షోలో కూడా అలరించబోతున్నాడట. అయితే ఈ నేపథ్యంలోనే యాంకర్‌ సుమ చేసే క్యాష్‌ షోకి జాతి రత్నాలు టీం వచ్చి, అందర్నీ తెగ నవ్వించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ షో లో ఓ వ్యక్తి తాను ఇక్కడ ఉండడానికి కారణం పంచ్ ప్రసాద్, ఎందుకంటే తాను అక్కడ ఉందామని అనుకున్నా, కానీ ఆయన అక్కడ ఉండడం వల్ల తాను ఇక్కడే ఉండిపోయానని కౌంటర్ వేయడంతో అక్కడున్నవారంతా నవ్వుతారు. అసలు ఏం జరిగింది, ఆ వ్యక్తి ఎందుకలా అన్నాడు అని తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకూ ఎదురు చూడాల్సిందే.