Pahalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రదాడి: కంటతడి పెట్టించేలా చేస్తున్న ఫొటో

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం పహల్గామ్ ఓ ఘోర ఘటనకు దేశమంతా ఉలిక్కిపడింది. సాయంత్రం సమయంలో ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణలేని కాల్పులు జరిపారు. ఈ హఠాత్ దాడితో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అందరూ ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీయగా, కనీసం 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అనధికార సమాచారం. అయితే అధికారికంగా ఇప్పటికీ పూర్తి సమాచారం అందలేదు.

ఈ దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ దాడి జరిగిన ప్రదేశంలో చోటుచేసుకున్న హృదయ విదారక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భర్తను కాపాడమంటూ విలపించిన ఓ మహిళ వీడియో నెటిజన్ల కళ్లలో నీళ్లు తెప్పించేపనిచేస్తోంది.

మరోవైపు, “మేము టిఫిన్ తింటుండగా ఒక్కసారిగా ఓ వ్యక్తి వచ్చి భర్తపై కాల్పులు చేశాడు” అంటూ మరో మహిళ చెప్పిన వివరాలు విన్నవారికి గుండెల్లో గుబురెత్తేలా చేశాయి. ఒక్కసారిగా తాము పర్యటనకు వచ్చిన చోటు నరకంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ దాడిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి చెందగా, ఆయన భార్య, కుమారుడి కళ్లెదుటే ఈ హత్య జరిగింది. వారిద్దరూ క్షతగాత్రులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనపై భద్రతా దళాలు చుట్టుపక్కల గాలింపు చర్యలు ప్రారంభించాయి. దాడి అనంతరం ఉగ్రవాదులు అడవులవైపు పారిపోయినట్టు సమాచారం. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ఘటనపై సమగ్ర నివేదిక కోరింది. ఇటువంటి దాడులు పర్యాటకులకు భద్రతపై అనేక ప్రశ్నలు లేపుతున్నాయి. పహల్గామ్ వంటి శాంతియుత ప్రాంతాల్లో కూడా ఈ విధమైన ఉగ్రదాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ప్రాణం తీసిన పాపిష్టి పిన్ని || Shocking Facts About Warangal Sai Prakash Missing Case || TR