Radhey shyam : బాలీవుడ్ 100కోట్ల క్లబ్ రాధే శ్యామ్ కు కష్టమేనా..?

Radhey Shyam:పాన్ ఇండియా మూవీ గా అభిమానుల ముందుకు రాధేశ్యామ్ వచ్చేసింది.ఈ సినిమా కు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా, టి -సిరీస్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా లో కృష్ణం రాజు, భాగ్యశ్రీ లు కీలక పాత్రల్లో నటించడం జరిగింది.సాహో చిత్రం తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధేశ్యాం సినిమా విడుదల అయిన రోజు నుంచి మిశ్రమ స్పందనతో నే ముందుకు వెళుతోంది.

ప్రభాస్ నటించిన సాహో సినిమా టాలీవుడ్లో ఫ్లాప్ టాక్ అందుకున్న కూడా బాలీవుడ్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టి కలిగింది. దీనికి కారణం సాహో సినిమా మీద బాహుబలి 2 ప్రభావం చాలా ఉంది. అంతే కాదు ఇది యాక్షన్ మూవీ, సాహో చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఇమేజ్ ఉన్న జాక్వలిన్ ఫెర్నాండెజ్, శ్రద్ధ కపూర్ హీరోయిన్లు నటించడం జరిగింది. దీని ప్రభావం కూడా సాహో సినిమా బాలీవుడ్లో విజయం సాధించడానికి కారణం.

కానీ ఇప్పటికే నెగిటివ్ టాక్ మీద నడుస్తున్న రాధేశ్యామ్ సినిమా టాలీవుడ్లో వంద కోట్ల క్లబ్ లో చేరడం కొద్దిగా కష్టమే అని అంటున్నారు.ప్రస్తుతానికైతే బాలీవుడ్ లో మరో పెద్ద సినిమాతో ప్రభాస్ కు పోటీ లేదు.  కానీ వంద కోట్ల క్లబ్ కష్టమే అంటోంది బాలీవుడ్ ట్రేడ్. దీనికి కారణం సాహో సినిమా కి ఉన్న అన్ని అడ్వాంటేజ్ లు రాధేశ్యామ్ సినిమాకి లేవు.లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చింది రాధేశ్యామ్. బాలీవుడ్ కు కనెక్ట్ అయ్యేలా భాగ్యశ్రీ, కునాల్, పూజాహెగ్డే లాంటి వాళ్లను తీసుకున్నప్పటికీ వాళ్లకు స్టార్ అప్పీల్ లేదు. ఇవన్నీ పక్కనపెడితే ఇది యాక్షన్ మూవీ కాదు. అందుకే వసూళ్లు చాలా తక్కువగా వస్తున్నాయి. సరిగ్గా ప్రమోషన్ చేయకపోవడం కూడా ఓ కారణం. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే వంద కోట్ల క్లబ్ మాత్రం దాదాపు అసాధ్యమనే అంటున్నారు.