“రాధే శ్యామ్” షూటింగ్ అయిపోయినా కూడా రిలీజ్ చేయకపోవడానికి ఇదే కారణం..?

ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ “రాధే శ్యామ్”. అద్భుతమైన ప్రేమ కావ్యంగా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మోస్ట్ బ్యూటిఫుల్ .. అండ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా నటిస్తోంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియోషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ సంగీతమందిస్తున్నాడు. సీనియర్ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.

Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment  News,The Indian Express

కాగా ఇటీవలే ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని వచ్చిన “రాధే శ్యామ్” యూనిట్ తిరిగి హైదరాబాద్ లో ఫైనల్ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారట. డిసెంబర్ మూడవ వారం వరకు “రాధే శ్యామ్” షూటింగ్ మొత్తం కంప్లీటవుతుందని సమాచారం. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడకక్షన్ కి కాస్త టైం ఎక్కువ పడుతుందని తెలుస్తోంది. వీఎఫెక్స్ వర్క్ కోసం ఎక్కువ సమయం పడుతుంటడంతో డిసెంబర్ లో “రాధే శ్యామ్” షూటింగ్ కంప్లీట్ అయినప్పటికి రిలీజ్ మాత్రం ఏప్రిల్ లేదా మే లో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కంప్లీట్ అవగానే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించబోయో ఆదిపురుష్ లో జాయిన్ కానున్నాడు. ఈ సినిమా 2021 సంక్రాంతి తర్వాత మొదలవబోతుందని నాన్ స్టాప్ గా 3 నెలల పాటు చిత్రీకరణ సాగనుందని సమాచారం. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా మొదలు పెట్టి కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ ఆది పురుష్ కి షిఫ్ట్ అవుతాడట. ఇలా 2021 లో ఆదిపురుష్ తో పాటు వైజయంతీ మూవీస్ నిర్మించే నాగ్ అశ్విన్ సినిమాని సమాంతరంగా పూర్తి చేస్తాడట. ఇక ఈ రెండు సినిమాలు 2022 లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.