ఇన్సైడ్ టాక్ : ఏంటి “ఆదిపురుష్” కి ఈ ప్లానింగ్ కూడా చేసారా?

లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చి భారీ ప్లాప్ గా నిలిచిపోయిన లేటెస్ట్ చిత్రం “ఆదిపురుష్”. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ అయితే ఊహించని విధంగా డిజాస్టర్ ఫలితాన్ని చూడాల్సి వచ్చింది.

అయితే ఈ చిత్రం వైఫల్యానికి గల చాలా కారణాల్లో దర్శకత్వం కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని కాస్త వేరేగా ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాడు కానీ అది కాస్త మిస్ ఫైర్ అయ్యి దెబ్బ పడింది. అయితే ఆదిపురుష్ స్టార్టింగ్ టైం లోనే చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు చెప్పిన మేకర్స్ సినిమా రిలీజ్ అయ్యాక ఆ మాటలు మార్చేశారు.

ఈ విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ సినిమా కూడా సీక్వెల్స్ లా ఉంటుందా అనే దానికి అప్పుడు మేకర్స్ లేదు ఒక్క సినిమాగానే ఉంటుంది అని అన్నారు. కానీ లేటెస్ట్ గా బాలీవుడ్ సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా హిట్ అయ్యితే డెఫినెట్ గా మరో రెండు మూడు భాగాలూ ప్లాన్ చేద్దాం అని ఓంరౌత్ అండ్ టీం అనుకున్నారట.

కానీ సినిమా ఇప్పుడు ఇలాంటి ఫలితాన్ని అందుకోవడంతో అయితే ప్రభాస్ సేఫ్ అయ్యాడు అనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి అయితే ఫ్రాంచైజ్ గా ప్లాన్ చేసిన ఈ సినిమా సింగిల్ గానే ఆగిపోయింది.