ఆ ఒక్క విషయంలో నాగార్జునతో నటించడానికి శ్రీదేవి అంతలా భయపడిందా?

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె మరణం ఇండస్ట్రీకి తీరని శోకమని చెప్పాలి. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో వందల కొద్ది సినిమాలలో నటించిన శ్రీదేవి తెలుగులో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మదిని దోచారు. ఈమె ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వారితో మాత్రమే కాకుండా వీరి వారసులతో కూడా కలిసి నటించారు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏఎన్ఆర్ శ్రీదేవి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న శ్రీదేవి నాగార్జునతో కలిసి నటించడానికి వెనకడుగు వేశారట.ఇలా ఈమె నాగార్జునతో నటించడానికి ఎందుకు సంకోచించారు అసలు భయపడాల్సిన విషయం ఏంటి అనే విషయానికి వస్తే.. శ్రీదేవి నాగేశ్వరరావు గారితో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. నాగేశ్వరరావుతో కలిసి నటించిన శ్రీదేవి తిరిగి నాగార్జునతో కలిసి నటిస్తే జనాలు తనని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని కంగారు పడ్డారట.

ఇలా తండ్రి కొడుకులతో నటించిన తనని ప్రేక్షకులు ఆదరిస్తారా అనే సందేహం కలిగి నాగార్జునతో నటించడానికి శ్రీదేవి భయపడ్డారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శ్రీదేవికి భరోసా కల్పించి మీ ఇద్దరి జంటను మోస్ట్ రొమాంటిక్ జంటగా తీర్చిదిద్దుతా. జనాలకు నేను కనెక్ట్ చేస్తా అని శ్రీదేవికి మాటిచ్చాడట రాఘవేంద్రరావు.ఇలా రాఘవేంద్రరావు భరోసా ఇవ్వడంతో శ్రీదేవి నాగార్జునతో కలిసి ఆఖరి పోరాటం సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా ఈ జంటకి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయని చెప్పాలి.