పెంగ్విన్ సినిమా ప్రభావం వల్ల మిస్ ఇండియా ని పట్టించుకోవడం లేదా ..?

టాలీవుడ్ .. కోలీవుడ్ లో వరసగా భారీ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలని చక చకా ఒప్పుకోవడంతో పాటు జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తుంది కీర్తి సురేష్. చెప్పాలంటే ఇన్ని సినిమాలు సౌత్ లో ఉన్న మరే హీరోయిన్ చేయడం లేదనే అంటున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా థియోటర్స్ తెరవకపోవడం తో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే పెంగ్విన్ సినిమా ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే.

Strong cinematography but poor script: Penguin leaves viewers cold - The  Federal

కాగా కీర్తి సురేష్ నటించిన మరో సినిమా మిస్ ఇండియా కూడా ఓటీటీలో రిలీజ్ కి రెడి అయింది. కాని ఈ విషయం అంతగా సాధారణ ప్రేక్షకులకి తెలియడం లేదని కామెంట్ చేస్తున్నారు. నవంబర్ 4 న ఈ సినిమా రీలీజ్ చేశారు. కాని ప్రేక్షకుల్లో పెద్ద బజ్ క్రియోట్ అవలేదని అంటున్నారు. అంతేకాదు భారీగా ప్రమోషన్స్ కూడా ఎక్కడా చేసింది లేదు. మరి మేకర్స్ ఎందుకు ఇలా ఈ సినిమాని గాలికి వదిలేశారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.

క్రేజ్ పరంగా కీర్తి సురేష్ టాప్ ప్లేస్ లో ఉంది. మరి ఓటీటీ ప్రభావమా లేక పెంగ్విన్ ఫ్లాప్ అవడంతో ఆ ప్రభావం మిస్ ఇండియా మీద పడిందా అన్నది క్లారిటీ రావడం లేదు. మరి మిస్ ఇండియా ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. కీర్తి మాత్రం వరసగా కొత్త ప్రాజెక్ట్స్ ఒకే చేస్తూ వెళుతోంది.

Miss India Movie Release Date in Amazon Prime - Where to watch Miss India  Movie Online? Know

ప్రస్తుతం నితిన్ తో కీర్తి సురేష్ నటించిన రంగ్ దే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. మహేష్ తో సర్కారు వారి పాట చేస్తోంది. అలాగే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖీ తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే లో కూడా నటిస్తుంది. ఇక తాజాగా మెగాస్టార్ నటించే సినిమాలో చెల్లి పాత్ర కి కీర్తి ని అడుగుతున్నట్టు సమాచారం.