నరేష్ మొదటి భార్య చనిపోవటానికి కారణం అతనేనా .. వైరల్ అవుతున్న న్యూస్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం. ఇలా ఇప్పటికే ఎంతోమంది నటీనటులు వారి మొదటి వివాహాన్ని రద్దు చేసుకొని రెండవ వివాహం చేసుకున్నారు. కానీ విజయనిర్మల వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్ మాత్రం ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా ప్రస్తుతం తన 60 పదుల వయసులో నాలుగో వివాహం చేసుకోవడానికి సిద్ధపడటంతో ఈయన పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న నరేష్ న్యూ ఇయర్ సందర్భంగా లిప్ లాక్ వీడియో షేర్ చేసి ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో నరేష్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం ప్రస్తుతం చర్చాంషనీయంగా మారింది.

అంతేకాకుండా నరేష్ మొదటి భార్య చనిపోవటానికి అతనే కారణమని కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. నటుడిగా గుర్తింపు పొందిన నరేష్ మొదట సీనియర్ కెమెరామెన్ అయిన శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి బాబు పుట్టిన తర్వాత కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరికొకరు దూరం అయ్యారు మొదటి కొడుకు నవీన్ కృష్ణ 18 సంవత్సరాల పాటు నరేష్ వద్దనే ఉన్నాడు. ఇలా భర్త తోడు లేక కొడుకు కూడా దూరంగా ఉండటంతో నరేష్ మొదటి భార్య మానసికంగా కృంగిపోయి అనారోగ్యం పాలై ఆఖరికి ప్రాణాలు కోల్పోయిందని సమాచారం.

ఇలా నరేష్ తన కొడుకు తనకే చెందాలని పట్టుబట్టి మొదటి భార్యను ఒంటరిని చేయటంతో ఆమె మానసికంగా కృంగిపోయి ప్రాణాలు కోల్పోయింది. అందువల్ల నరేష్ మొదటి భార్య చావుకు నరేష్ కారణమని అనేకమంది అతన్ని విమర్శిస్తున్నారు. ఇక ఆ తర్వాత నరేష్ రేఖ సుప్రియ అనే మరొక మహిళని రెండవ వివాహం చేసుకొని కొంతకాలానికి ఆమెకు కూడా దూరం అయ్యాడు. ఇక రమ్య రఘుపతి ని వివాహం చేసుకున్న తర్వాత పవిత్ర లోకేష్ తో రిలేషన్ పెట్టుకోవడం వల్ల వారిద్దరి మధ్య గొడవలు వచ్చి నరేష్ తన మూడవ భార్యకు కూడా దూరం అయ్యాడు. ఇలా ఇప్పటివరకు నరేష్ చేసుకున్న మూడు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి.