దిల్ రాజు అల్లు అర్జున్ ” ఐకాన్ ” ని వదిలేశాడా ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా తో ఈ ఏడాది ప్రారంభంలోనే ఇండస్ట్రీ రికార్డ్ సాధించాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అన్న సినిమా కమిటయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ రేంజ్ సినిమాగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

Allu Arjun Pushpa setting with Mahabubnagar - tollywood

అయితే వాస్తవంగా అల్లు అర్జున్ ఈ రెండు సినిమాలకంటే ముందే ఐకాన్ అన్న సినిమా చేయాల్సి ఉంది. దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో భారీగా నిర్మిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని తెరకెక్కిస్తున్న వేణు శ్రీరాం ఈ సినిమాకి దర్శకత్వం వవహించాల్సింది.

కాని ఎందుకనో ఈ సినిమా పట్టాలెక్కలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న ప్రచారం మొదలవగా లాక్ డౌన్ కి ముందే దిల్ రాజు ‘ఐకాన్’ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అని తేల్చేశారు. కాని మళ్ళీ దాదాపు 6 – 7 నెలల నుంచి ఈ సినిమా ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్‌డేట్ ఏమీ రాలేదు. ఇటీవల అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కొరటాల శివ తో చేస్తున్నట్టు ప్రకటించాడు.

Allu Arjun announces new film with Koratala Siva: Been looking forward to  this for quite a while - Movies News

దాంతో ఇప్పుడు అందరూ మళ్ళీ ఐకాన్ గురించే చర్చించుకుంటున్నారట. కంప్లీట్ గా అల్లు అర్జున్ ఐకాన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని అంటున్నారు. అయితే ఆమధ్య దర్శకుడు వేణు శ్రీరాం వకీల్ సాబ్ కంప్లీట్ చేసి ఐకాన్ మొదలు పెడతానని చెప్పుకొచ్చాడు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో దిల్ రాజు నిజంగా ఐకాన్ ని వదిలేశాడా లేదా అన్నది ఆయనే క్లారిటి ఇస్తే తెలుస్తుంది.