మారుతీ ప్రాజెక్ట్ లో మిస్సైన ప్రభాస్ ని విట్నెస్ చేస్తామా.?

ఏ హీరోని అయినా కూడా తాము ఏ  అయితే అభిమానులు అయ్యారో ఆ తరహాలో మళ్ళీ తమ హీరోని చూడాలి అని ప్రతీ అభిమాని కూడా కోరుకుంటాడు. అయితే హీరోలు రొటీన్ కి భిన్నంగా కాస్త కొత్త కోతలు ట్రై చేస్తూ తమ వింటేజ్ ట్రీట్ ని పక్కన పెట్టేస్తుంటారు. దీనితో వారి ఫ్యాన్స్ కి ఇవి బాగా మిస్ అవుతాయి.

మరి ఇపుడు అయితే ఈ మిస్సైన ఎలిమెంట్స్ ని కొందరు దర్శకులు మళ్ళీ ప్రయత్నం చేస్తూ పలువురు సీనియర్ హీరోల అభిమానులకి మంచి ట్రీట్ ఇచ్చారు. అలా ఈ ఏడాది వచ్చిన వీరసింహా రెడ్డి లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య ని దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రెజెంట్ చెయ్యగా మెగాస్టార్ చిరంజీవిని అయితే వాల్తేరు వీరయ్య లో బాబీ చూపించాడు.

ఇక ప్రభాస్ ని కూడా దర్శకుడు మారుతీ ఇదే రేంజ్ లో తాను ప్రెజెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో నటించిన కమెడియన్ మహేష్ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ చాలా కొత్తగా ఉంటారు అని గత కొన్నాళ్లుగా మిస్ అవుతున్న ప్రభాస్ ని ఆయన ఫ్యాన్స్ తప్పకుండా చూస్తారని ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా అదిరిపోతుంది అని అంతే కాకుండా సెట్స్ లో ప్రతి ఒక్కరినీ ప్రభాస్ ఎంతో బాగా చూసుకుంటారని తెలిపాడు.

దీనితో మొత్తానికి అయితే మళ్ళీ మారుతీ సినిమాలో పాత ప్రభాస్ ని విట్నెస్ చేస్తామని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.