ఇన్సైడ్ టాక్ : “పుష్ప 2” కోసం షాకింగ్ బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు.?

Pushpa The Rise Got Solid TRP

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ పెరుగుతుందో చూస్తున్నాం. ముఖ్యంగా నార్త్ లో అయితే ఇంకా పుష్ప రాజ్ హవా ఓ రేంజ్ లో నడుస్తుంది. అందుకే పుష్ప 2 కి మాత్రమ్ ఎట్టిపరిస్థితుల్లో దెబ్బ మిస్సవ్వకూడదు అని మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆల్రెడీ దర్శకుడు సుకుమార్ చాలా గ్రాండ్ లెవెల్లో స్క్రిప్ట్ ని సిద్ధం చేయగా మరికొన్ని వారాల్లో సినిమా సెట్స్ మీదకి కూడా వెళ్లనుంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో ఇన్ని అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు మేకర్స్ షాకింగ్ బడ్జెట్ పెడుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ టాక్.

మరి తాజా టాక్ ప్రకారం అయితే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా 350 నుంచి 380 కోట్లు పుష్ప ది రూల్ పై వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు భోగట్టా.. ఇది నిజం అయితే అల్లు అర్జున్ కెరీర్ లోనే మోస్ట్ కాస్ట్లీ సినిమా ఇది అవుతుందని చెప్పాలి.

ఇంకా మేకర్స్ కూడా ఇంత పెట్టడానికి కారణం ఈ సినిమాకి కేవలం థియేట్రికల్ గా 500  ఆఫర్స్ ఉండడమే అట. మరి అన్ని వందల కోట్లు లాభం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు? మొత్తానికి అయితే పుష్ప 2 మాత్రం గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాల్సిందే.