ఇన్సైడ్ టాక్ : “బ్రో” కి సెన్సార్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయ్?

ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సాలిడ్ చిత్రం “బ్రో ది అవతార్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా ఓ రీమేక్ అయినప్పటికీ దర్శకుడు సముద్రఖని దర్శకుడు త్రివిక్రమ్ తో కూర్చొని చేసిన మార్పులు చేర్పులు అన్నీ కూడా ఓ రేంజ్ లో అయితే ఇంప్రెస్ చేసాయి.

దీనితో మంచి హైప్ వచ్చిన ఈ సినిమా తర్వాత పాటలతో అయితే దానిని పోగొట్టుకుంది. కానీ ఊహించని విధంగా ఇప్పుడు బ్రో చిత్రానికి యూకే దేశంలో బుకింగ్స్ ఓపెన్ చేయగా ఆల్రెడీ సుమారు రెండు వేల టికెట్స్ మేర బుక్ అయ్యిపోయాయి. దీనితో ఫ్యాన్స్ మాత్రం మంచి క్రేజీగానే ఉన్నారని అర్ధం అవుతుంది.

అయితే ఈ సినిమా విషయంలో లేటెస్ట్ గా దర్శకుడు సముద్రఖని ఓ పోస్ట్ పెట్టడం అయితే వైరల్ గా మారింది. సెన్సార్ యూనిట్ కి బ్రో సినిమా చూపించాం అని మా బ్రో టైం బాగుంది అన్నట్టుగా అందులో తెలిపారు. ఐతే ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం బ్రో కి అయితే సెన్సార్ టాక్ అదిరిపోయింది అని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ ఎంట్రీ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ని ఇస్తుంది అని అలాగే డెఫినెట్ గా పవన్ ఎంట్రీ ఫ్యాన్స్ కి గుర్తుండిపోతుంది అని అంటున్నారు. దీనితో అయితే సెన్సార్ నుంచి కూడా మంచి టాక్ ఈ చిత్రానికి దక్కినట్టే అని చెప్పాలి. వీటితో పాటుగా క్లైమాక్స్ లో ఇచ్చే ఎమోషనల్ సందేశం చాలా మందికి కనెక్ట్ అవుతుంది అని కూడా అంటున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జూలై 28న సినిమా రాబోతుంది.