ఇండస్ట్రీ బజ్ : “ఆనిమల్ పార్ట్ 2” అప్పుడు స్టార్ట్ చేస్తారా??

ప్రస్తుతం సౌత్ ఇండియా సహా పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “ఆనిమల్” అనే చెప్పాలి. మరి భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం హిందీలో రికార్డు గ్రాస్ వసూళ్లు కొల్లగొడుతూ వీక్ డేస్ లో కూడా దూసుకెళ్తుంది.

దీనితో ఇప్పుడు ఈ సినిమా హవా అలా కంటిన్యూ అవుతుండగా ఈ చిత్రంకి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పార్ట్ 2 ను కూడా చేస్తున్నట్టుగా లాస్ట్ మినిట్ లో కన్ఫర్మ్ చేసాడు. మరి దీనితో ఆనిమల్ పార్ట్ 2 పై కూడా క్రేజీ హైప్ సెట్ అయ్యింది. మెయిన్ గా హీరో రణబీర్ కపూర్ వర్సెస్ రణబీర్ కపూర్ కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ చిత్రాన్ని “ఆనిమల్ పార్క్” గా కన్ఫర్మ్ చేయగా ఈ సినిమా ఎప్పుదు స్టార్ట్ అవుతుంది అనేదానికి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో బజ్ వినిపిస్తుంది. దీనితో అయితే ఈ చిత్రం 2026లో సెట్స్ మీదకి వెళుతుంది అని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు వంగ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ఓ సినిమా చేస్తాడు అది 2025 నాటికి కంప్లీట్ అవుతుంది.

ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా స్క్రిప్ట్ ఇతర పనులు కంప్లీట్ అవ్వకపోతే 2026 లోనే ఆనిమల్ పార్క్ ని తాను స్టార్ట్ చేస్తాడని అంటున్నారు. ఆనిమల్ క్లైమాక్స్ బిట్ లో ఇచ్చిన రివీల్ కి ఆడియెన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. మరి చూడాలి ఆనిమల్ పార్క్ ఎప్పుడు మొదలవుతుంది అనేది.

ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న త్రిపాఠీ దిమిరి తదితరులు నటించగా బాబీ డియోల్, అనీల్ కపూర్ లు ముఖ్య పాత్రల్లో కనిపించారు.