వైరల్ పిక్ : ఒకే ఫ్రేమ్ లో మన బాక్సాఫీస్ మాన్స్టర్స్.. ఎక్కడ కనిపించారంటే.!

 

కొన్ని కొన్ని ఫొటోలకి అలాగే కాంబినేషన్స్ క ఎలాంటి పరిచయాలు అక్కరలేదు. అలాంటి స్టార్డం తెచ్చుకున్న హీరోలుగా ఇప్పుడు మన సౌత్ ఇండియన్ సినిమా నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు రాకింగ్ స్టార్ యష్ లు నిలిచారు. అయితే ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మాన్స్టర్స్ లాంటి వాళ్ళే..

 

పైగా ఇద్దరూ ఒకే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేసి బిజీగా ఉన్నారు. మరి ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి హై లోనే వారి అభిమానులు ఉన్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ ఎలా చోటు చేసుకుంది అంటే వీరి సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ బర్త్ డే ఈరోజు కావడంతో ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ హాజరు అయ్యారు.

అలాగే ప్రభాస్ అయితే ఏకంగా హైదరాబాద్ నుంచి బెంగళూర్ వెళ్లి ప్రశాంత్ నీల్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. అప్పుడు యష్ కూడా ఉండగా ఈ మాసివ్ ఫ్రేమ్ సాధ్యం అయ్యింది. దీనితో వీరి సినిమాల నిర్మాణ సంస్థ హోంబళే వారు ఈ ఇద్దరు ఇండియన్ బాక్సాఫీస్ డైనమైట్స్ ఒకే చోట చేరడం ఆనందంగా ఒకింత స్పెషల్ గా ఉందని తెలిపి ఆనందం వ్యక్తం చేయగా ఇప్పుడు ఈ సెన్సేషనల్ స్నాప్ ఓ రేంజ్ లో విరావ్ అవ్వసాగింది.