జాతి రత్నాలు డైరెక్టర్ చెప్పులు వేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

పిట్టగోడ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి డైరెక్టర్ అనుదీప్ మొదటి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఈ సినిమా అనంతరం ఈయన జాతి రత్నాలు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఒక్కసారిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అను తక్కువ సమయంలోనే ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు.సోషల్ మీడియా వేదికగా అయిన లేదా ఏ ఇంటర్వ్యూలలో పాల్గొన్న అనుదీప్ చెప్పే సమాధానాలు అందరిని తనకు అభిమానులుగా మార్చేస్తుంది.

ఎప్పుడు ఎంతో సరదాగా ఫన్నీగా ఉండే అనుదీప్ ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్న కూడా అంతే ఫన్నీగా సమాధానాలు చెబుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఏదైనా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అంటే ఆ వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంది.ఈ విధంగా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయననీ కనుక గమనిస్తే అనుదీప్ ఎప్పుడూ కూడా చెప్పులు లేకుండా మనకు కనపడతారు. ఈ విధంగా అనుదీప్ చెప్పులు లేకుండా కనిపించడానికి ఓ కారణం ఉంది.

అనుదీప్ చెప్పులు లేకుండా ఎందుకు తిరుగుతున్నారు అనే విషయం గురించి ఈయనకు ప్రశ్న వేయడంతో ఈ ప్రశ్నను ఈయన దాటవేసినప్పటికీ ఈయన చెప్పులు వేసుకోకుండా ఉండడానికి గల కారణాలు మాత్రం అతని సన్నిహితులు వెల్లడించారు. అనుదీప్ క్లింట్ ఒబెర్ పుస్తకం రాసిన ఎర్తింగ్ అనే పుస్తకాన్ని చదివి అందులో ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాడట. సింథటిక్ వచ్చిన తర్వాత భూమికి మనకి మధ్య ఉన్నటువంటి బాండింగ్ మిస్ అవుతుందని చదివారట ఇది తెలిసినప్పటి నుంచి ఈయన చెప్పులు వేసుకోవడం మానేసారని ఆయన సన్నిహితులు తెలియచేస్తున్నారు. ఇలా అనుదీప్ గురించి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎంతోమంది అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.