అమ్మ లేకపోతే ఈరోజు నేను మీ ముందు ఉండేదాన్ని కాదేమో.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటి?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు దీపిక పదుకొనే.ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దీపిక పదుకొనే నటుడు రణవీర్ సింగ్ ను వివాహం చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇకపోతే తాజాగా నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కావడంతో చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి దీపిక పదుకొనే అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ఈమె ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం మాత్రమే ముఖ్యం కాదు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు.మానసికంగా మనం దృఢంగా లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అలాంటి ఇబ్బందులను తాను ఫేస్ చేశానని ఈమె తెలియజేశారు.ఒకానొక సమయంలో తాను పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఆ సమయంలో అమ్మ కనక లేకపోయి ఉంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు అంటూ దీపిక సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అయితే ఒంటరిగా ముంబైలో ఉండటం వల్ల ఎంతో కృంగిపోయానని అయితే అమ్మానాన్నలతో చూడటానికి వచ్చినప్పుడు అమ్మ నేను బాధపడుతున్న విషయాన్ని గుర్తించి తనని నిలదీసి అసలు విషయం కనుక్కున్నారు.తన పరిస్థితి మొత్తం చెప్పిన తర్వాత తన తల్లి తనకు తోడుగా ఉండి ఎంతో ధైర్యం నింపారని అలా అమ్మ కనుక ఆరోజు లేకపోయి ఉంటే ఏం జరిగేదోనని ఈమె వెల్లడించారు. నిజంగానే అమ్మను ఆ దేవుడే తన వద్దకు పంపారని డిప్రెషన్ లో ఉన్నవారికి కుటుంబం మద్దతు ఎంతో అవసరమని ఈ సందర్భంగా దీపిక తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వెల్లడించారు.