ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ గ్రాఫిక్స్ కోసం భారీ ప్లానింగ్స్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న మాసివ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. “ప్రాజెక్ట్ కే” గా పిలవబడుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటుండగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనె మరియు అమితాబ్ బచ్చన్ లు నటిస్తున్నారు.

అలాగే ఈ సినిమా ఓ ఇంట్రెస్టింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి సినిమాలో పౌరాణికం అలాగే ఫ్యూచర్ లో కాన్సెప్ట్ లాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు భారీ విజువల్స్ కనిపించనున్నాయి. పైగా ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్నే తాను సృష్టించామని చిత్ర యూనిట్ తెలిపారు. కాగా ఈ తరహా సినిమా అంటే భారీ ఎత్తున గ్రాఫిక్స్ తప్పనిసరి.

అందుకే ఈ సినిమాకి గాను గత 5 నెలల నుంచి ఈ పనులు ప్రపంచ దేశాలకి చెందిన ఎన్నో హాలీవుడ్ సినిమాలకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారట. మొత్తం 5 బృందాలు అయితే ప్రాజెక్ట్ కే లో గ్రాఫిక్స్ పనులు చూస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే ఆదిపురుష్ తర్వాత హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ లో విజువల్స్ ఏ లెవెల్లో ఉంటాయో చూడాలి. కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది జనవరి 12 న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.