Adavallu Meeku Joharlu: భారీగా ప్లాన్ చేసిన ఆడాళ్ళు మీకు జోహార్లు రిలీజ్ ఈవెంట్… అతిథులుగా రానున్న స్టార్స్ వీళ్ళే!

Adavallu Meeku Joharlu: కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ రష్మిక జంటగా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం ఆడాళ్ళు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ సినిమా నేడు విడుదల కావడంతో ఈ సినిమా వచ్చే నెల 4వ తేదీకి వాయిదా పడింది. ఈ క్రమంలోనే చిత్రబృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

మార్చి 4వ తేదీ ఈ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ వేడుకను ఫిబ్రవరి 27 హైదరాబాద్ శిల్పకళావేదికలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చిత్రబృందం ప్రముఖ స్టార్ సెలబ్రిటీలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా తెలియజేస్తూ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా నటి కీర్తి సురేష్, సాయి పల్లవి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. అదేవిధంగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానున్నారు. ఇక ఈ వేదికపై కీర్తి సురేష్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక శరత్ కుమార్, ఖుష్బూ, ఊర్వశి వంటి నటీమణులు ప్రముఖ పాత్రలో సందడి చేయనున్నారు.