Pavan Kalyan: హరిహర వీర మల్లు మళ్ళీ పట్టాలెక్కనుందా?

Pavan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుస సినిమాలను షురూ చేసారు. అజ్ఞాతవాసి వాసి సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న పవన్ మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇక మళ్ళీ వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్ళీ హాట్ కొట్టిన పవన్ వెంటనే భీమ్లా నాయక్ తో అభిమానులకు పండగ చేసారు. రీమేక్ సినిమాలను ఎక్కువగా తీస్తున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ అదే బాటలో ఇంకో రీమేక్ సినిమాను ఓకే చేసారు.ఇలా వరుస సినిమాలను చేస్తూ బిజీ అయ్యారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి ఆయన విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత క్రిష్ జాగర్లమూడి ‘కొండపొలం’ సినిమాను తెరకెక్కించడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది, అయితే తిరిగి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ వచ్చే వారం నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ముందుగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది, ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా సెట్ కుడా వేశారట చిత్రా యూనిట్ . ఈ షెడ్యూల్ తో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది, మొఘల్ కాలం నాటి ఫిక్షనల్ కథతో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతోంది, ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, జాక్వలిన్ ఫెర్నాండేజ్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఇక హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియన్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా భీమ్లా నాయక్ విజయంలోనే మునిగి తేలుతున్నారు. ఇక మళ్ళీ ఇంకొ సినిమా త్వరలో సిద్ధం అవుతుందనే వార్త ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోంది