Gopichand : హీరో గా మొదలై మళ్ళీ విలన్ గాను మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోపీచంద్ . పూర్తి యాక్షన్ ప్యాకెడ్ హీరో అనే చెప్పాలి. యజ్ఞం, లక్ష్యం, గోలిమార్, సాహసం వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ మధ్య గోపిచంద్ సినిమాలు అంతగా హిట్ అవ్వడం లేదు వరుసగా ప్లాప్ లు పలకరిస్తున్న తరుణం లో ఒక ఆసక్తికర కాంబినేషన్ సెట్స్ పైకి రాబోతున్నట్లు సమాచారం.
జోంబిరెడ్డి సినిమాతో అనూహ్య విజయం అందుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో గోపీచంద్ నటించబోతున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ సైన్స్ ఫిక్షన్ తో కూడిన సోషియో ఫాంటసీ గా తీస్తున్న చిత్రం ‘హనుమాన్ ‘ ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ తో సినిమా పట్టాలెక్కనుంది. గోపీచంద్ కోసం ప్రశాంత్ వర్మ ఓ కథ రెడీ చేశారని తెలుస్తోంది. ఇటీవల గోపీచంద్ కి కూడా వినిపించాడట.
ఈ కథ కోసం ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయట . ఈ కథకి గోపీచంద్ ఓకే చెప్పేశాడని, హనుమాన్ తరవాత ఈ కథే పట్టాలెక్కబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. గోపీచంద్ ఖాతాలో హిట్టు పడి చాలా కాలం అయ్యింది. అయితే తనకు ప్రాజెక్టుల విషయంలో లోటు లేదు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందిన `పక్కా కమర్షియల్` విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదో మాస్ ఎంటర్టైనర్. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది.మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ. అందుకే గోపీచంద్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.