20 ఏళ్ల తర్వాత “గీతాంజలి” నటి రీఎంట్రీ.!

టాలీవుడ్ సినిమా సహా ఇండియన్ సినిమా దగ్గర కూడా మంచి క్లాసిక్ హిట్ అయ్యినటువంటి చిత్రాల్లో వెటరన్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన “గీతాంజలి” కూడా ఒకటి. మరి ఈ చిత్రం అయితే అక్కినేని నాగరాజును హీరోగా హీరోయిన్ గిరిజ షెట్టర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది.

అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాలు అయితే దాటింది. అయినప్పటికీ ఈ చిత్రం ఓ ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలవగా ఈ చిత్రం హీరోయిన్ గిరిజ ఈ ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ గా మారిన ఈమె నెక్స్ట్ అయితే ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అయితే ఆమె లాస్ట్ టైం 2002 లో హృదయాంజలి అనే చిత్రంలో కనిపించగా మళ్లీ

అయితే ఇప్పుడు ఈమె మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అయితే సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుండడం లేటెస్ట్ గా బయటకి వచ్చింది. ఐతే ఈమె ఇప్పుడు కన్నడ లో కొత్త సినిమాతో రాబోతున్నట్టుగా ఫిక్స్ చేసారు. ఇక ఈ చిత్రానికి చంద్రజిత్ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రానికి “ఇబ్బని తబ్బిడ ఇలియాలి” టైటిల్ ని ఫిక్స్ చేసి అనౌన్స్ చేసారు.

అంతే కాకుండా ఈ చిత్రాన్ని కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి అయితే నిర్మాణం వహిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే అప్పటికి ఇప్పటికీ ఈమె లుక్ లో చాలా తేడా మనం గమనించవచ్చు అలాగే ఈమె మధుమిత అనే పాత్రలో నటిస్తుంది. ఒకవేళ ఫ్యాన్స్ ఐతే ఒకింత షాక్ కి కూడా లోను కావచ్చు. మొత్తానికి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత గీతాంజలి హీరోయిన్ రాబోతుంది అని చెప్పాలి.