ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాకి దీపిక తీసుకునే రెమ్యూనరేషన్ తో 4 సినిమాలు తీయొచ్చట ..?

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ లవ్ స్టోరీగా రూపొందుతుంది.

Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment  News,The Indian Express

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ మొదటి సారి ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంటరవుతోంది. ఇక ఈ సినిమా ఇటీవలే 15 రోజుల ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగొచ్చారు. నెక్స్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే భారీ హాస్పిటల్ సెట్ ని కూడా సిద్దం చేశారని సమాచారం.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో కూడా ఆది పురుష్ అన్న సినిమా చేసేందుకు కమిటవగా ఈ రెండు సినిమాలు కాస్త అటు ఇటుగా ఒకేసారి మొదలవనున్నాయని అంటున్నారు. ఆదిపురుష్ లో ఇప్పటికే ప్రభాస్ రాముడిగా నటించబోతున్నాడని ప్రకటించారు. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేష్ గా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అయితే దీపిక పదుకొణె కి వైజయంతీ వారు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. చెప్పాలంటే టాలీవుడ్ లో ఆ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ ఇప్పటి వరకు ఎవరూ లేరనే చెప్పాలి. నిజంగా అంత రెమ్యూనరేషన్ గనక ఇస్తున్నట్లైతే టాలీవుడ్ లో ఆ రెమ్యూనరేషన్ తో నాలుగు చిన్న సినిమాలు తీయొచ్చన్న మాట వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఏంటన్నది మేకర్స్ వెల్లడించాల్సి ఉంది.