ఫైనల్ గా “సలార్” కి సలాం కొట్టించారు.. 

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ఫైనల్ గా ఇదే ఏడాదిలో అయితే తన రెండో సినిమాతో ఫ్యాన్స్ ని ఇండియా ఆడియెన్స్ ని పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. కాగా ఆ సినిమానే “సలార్” కాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా భారీ పోటీ నడుమ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

మెయిన్ గా బాలీవుడ్ లో ఈ సినిమాకి గట్టి పోటీ నెలకొంది. దీనితో లాస్ట్ మినిట్ లో బాలీవుడ్ నేషనల్ చైన్స్ లో సినిమాకి చోటు ఇవ్వకపోవడంతో సలార్ మేకర్స్ మేము సౌత్ లో సినిమా ఇవ్వం అని తేల్చి చెప్పేసారు. ఇస్తే నార్త్ లో కూడా స్క్రీన్స్ ఇవ్వాలి లేని పక్షంలో సౌత్ లో తమ సినిమా ఇవ్వం అని చెప్పేసారు.

దీనితో సలార్ విషయంలో టెన్షన్ వాతావరణం నెలకొనగా ఫైనల్ గా మాత్రం సలార్ యూనిట్ దెబ్బకి నేషనల్ మల్టీప్లెక్స్ వారు సలాం కొట్టి సైడ్ ఇచ్చారు. సలార్ మేకర్స్ కోరుకున్నట్టుగానే ఇండియా వైడ్ గా సినిమాని రిలీజ్ చేస్తూ బుకింగ్స్ ని ఇవాళ విడుదల చేశారు. దీనితో అటు నార్త్ సహా ఇక్కడ సౌత్ లో కూడా సలార్ బుకింగ్స్ మొదలు కాగా ఇక్కడ కూడా భారీ బుకింగ్స్ తో సలార్ వేట మొదలైంది.

దీనితో మొత్తానికి చిత్ర యూనిట్ తమ పంతాన్ని నెగ్గించుకొని గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు.