పుష్ప 2 అప్డేట్ కోసం గీత ఆర్ట్స్ ఎదుట ధర్నా చేస్తున్న అభిమానులు?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి బారి కలెక్షన్లను కొల్లగొట్టిన విషయం మనందరికీ తెలిసింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పుష్ప ది రైజ్ మొదటి భాగం తెలుగు సినిమా రికార్డులను తిరగరాస్తూ విడుదలైన అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని నమోదు తెలుగు ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచిందని గర్వంగా చెప్పవచ్చు.

అల్లు అర్జున్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మార్చిన పుష్ప సినిమాను రెండు భాగాల్లో విడుదల చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. పుష్ప ది రైజ్ అంటూ వచ్చిన మొదటి భాగం విడుదలై ఏడాదిన్నర గడుస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప-ది రూల్ విషయంలో చిత్ర యూనిట్ కానీ డైరెక్టర్ సుకుమార్ కానీ ఎటువంటి అప్డేట్ ఇంతవరకు ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ అభిమానుల్లోనూ, సగటు తెలుగు ప్రేక్షకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పవచ్చు.

పుష్ప పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ ఉర్రూతలూగించిన పుష్ప సినిమా పార్ట్ 2 పై చిత్ర నిర్మాతలు దర్శకుడు ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నేడు పుష్ప 2 అప్డేట్స్ వెంటనే ఇవ్వాలంటూ గీతా ఆర్ట్స్ ముందు ఆందళోనకు దిగారు. ఇంకా ఆలస్యం చేస్తే మైత్రి ఆఫీస్ ముందు ధర్నా చేస్తామంటూ ఫ్యాన్స్ అల్టిమేటమ్ జారీ చేసారు. మరి దీనిపై పుష్ప చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.