పుష్ప 2 అప్డేట్ కోసం రోడ్డెక్కిన అభిమానులు.. ఇది టూమచ్ అంటూ కామెంట్లు చేస్తున్న నెటిజెన్లు?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఈ సినిమాకి కూడా అదే స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ సినిమా ద్వారా నార్త్ సౌత్ అనే తేడా లేకుండా జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ గుర్తింపు పొందారు.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

పుష్ప సినిమా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదల అయ్యి సంచలనాలు సృష్టించింది. అయితే ఈ సినిమా విడుదల ఈ సంవత్సరం కావచ్చునప్పటికీ ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు.ఇదిగో అదిగో అంటూ ఏడాది పూర్తి చేశారు కానీ ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి సమాచారం అందకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అభిమానులు గత రెండు రోజుల క్రితం గీతా ఆర్ట్స్ బ్యానర్ ఎదుట ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.

ఈ విధంగా గీత ఆర్ట్స్ బ్యానర్ ఎదుట ధర్నా చేసినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు ఏకంగా తమకు పుష్ప 2 నుంచి అప్డేట్ కావాలంటూ బ్యానర్లు పట్టుకొని అభిమానులు రోడ్డు ఎక్కారు.ఇలా అభిమానులు ధర్నా చేస్తున్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు తమ హీరో క్రేజ్ చూసి సంతోషం వ్యక్తం చేయగా ఇతర హీరోల అభిమానులు సినిమా అప్డేట్ కోసం ధర్నాలు చేయడం ఏంటి? ఇది చాలా విడ్డూరం అంటూ కామెంట్లు చేస్తున్నారు.