Chiranjeevi- Pawan Kalyan: ఒకే ఫ్రేమ్ లో మెగా స్టార్, పవర్ స్టార్ పండగ చేసుకుంటున్న అభిమానులు!

Chiranjeevi- Pawan Kalyan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసారు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23 న హైదరాబాద్ యూసుఫ్ గూడాలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ రాజకీయ ప్రముఖులు KTR, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్ హాజరయ్యారు. అయితే ఈ ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీ నుండి ఎవరు హాజరు కాలేదు. ఫ్యాన్స్ లో ఆ లోటును తీర్చడానికి అన్నట్టుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు నా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో ను రిలీజ్ చేసారు. భీమ్లా నాయక్ టీంతో చిరంజీవి గడిపిన ఆనందకర క్షణాలను వీడియో తీసి పోస్ట్ చేసారు.

ఈ వీడియో చివర్లో గాడ్ ఫాదర్ టీం నుండి భీమ్లా నాయక్ కు ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేయడం అందరిని ఆకట్టుకుంది. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతోంది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి,నిత్య మీనన్, సంయుక్త మీనన్, సముద్రఖని, రావు రమేష్ తదితరులు నటించారు. సాగర్ కే చంద్ర సినిమాకు డైరెక్టర్ మరియు సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన.

ఇక ఈ విధంగా ఒకే ప్రేమ్ లో చిరు,పవన్ కనిపించడంతో
అభిమానులు పండగ చేసుకుంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు టికెట్స్ బుక్ చేసుకుని ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇందులో పవన్ తో పాటు రానా కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.