సమంత కి ఏమైంది అని కంగారు పడుతున్న ఫ్యాన్స్.

సమంత అక్కినేని ప్రస్తుతం ఆహా కోసం సామ్ జామ్ అన్న టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో పలువురు సినీ తారలని ఇంటర్వ్యూ చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది. సమంత నుంచి సినిమాలు రావడం లేదని ఫీలవుతున్న ఫ్యాన్స్ కి ఈ షో ద్వారా కాస్త ఊరట కలిగిస్తోంది. ఇక రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించబోతున్న శాకుంతలం లో నటిస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి రాబోతోంది. అలాగే ఒక తమిళ సినిమా కూడా చేస్తోంది సమంత. అయితే ఈ అక్కినేని కోడలిలోని వివిధ కోణాల గురించి గొప్పగా చెప్పుకొని తీరాల్సిందే. స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉన్నప్పటికీ ప్రత్యూష సేవా సంస్థను స్థాపించి సామాజిక సేవ చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Samantha Interview With Sadhguru

అనాధలు.. పేద పిల్లలకు అవసరమయ్యే ఆర్థిక సాయం అందిస్తుంది. ఇక ఈ మధ్యే మొదలు పెట్టిన బిజినెస్ తో కూడా బిజీగా ఉంటోంది. స్నేహితురాలు ఉపాసనతో కలిసి హెల్త్ టిప్స్ అందిస్తోంది. ఇన్ని చేస్తూనే తనలోని ఆధ్యాత్మిక చింతనను తాజాగా పరిచయం చేసింది సమంత. సమంత ఇటీవలే ఆధ్యాత్మిక గురువు సద్గురును కలిసారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక చింతన గురించి దైవికం గురించి సామ్ చెప్పిన కొన్ని విషయాలు భక్తి భావాన్ని పెంచేవిగా ఉన్నాయి. శిష్యులు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు కనిపిస్తారు.. సద్గురు చెంత ఉన్నాను అంటూ సామ్ ఒక ఫోటోని అభిమానులతో పంచుకుంది.

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏమిటో తెలిపింది. మీకు మీరుగా గీసుకున్న సరిహద్దులను విచ్ఛిన్నం చేయడం .. మీరు ఉన్న స్థితి నుంచి బయటపడి అపార మనోజ్ఞతను అనుభవించడం. మీ అజ్ఞానం ఫలితంగా.. మీరు నకిలీ అయ్యారు. పరిమిత చింతన నుండి మిమ్మల్ని మీరు బయటపడేయడం.. సృష్టికర్త మిమ్మల్ని చేసిన విధంగా జీవించడం-పూర్తిగా ఆనందకరమైన అనంతమైన బాధ్యతను కలిగి ఉండాన్ని జ్ఞానోదయం సాధించడం అని అంటారు .. అంటూ ఎంతో అమూల్యమైనమైన సందేశాన్ని వినిపించింది సమంత. ఇది చూసిన సమంత అభిమానులు మా సమంత కి ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారట.