ఇండస్ట్రీ టాక్ : విజయ్ సినిమాకి ఫేక్ నెంబర్స్ వేస్తున్నారా?

తమిళ సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్న స్టార్ నటుల్లో దళపతి విజయ్ కూడా ఒకడు. అయితే బిజె క్రేజ్ ఆన్లైన్ లో మైండ్ బ్లాకింగ్ గా ఉంటుంది. తన పాటలు గాని తన పోస్ట్ లు గాని సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంటాయి. నిజానికి అయితే తన సోషల్ మీడియా క్రేజ్ ఇండియా లో ఏ హీరో కి కూడా లేదు అని చెప్పడంలో సందేహం లేదు.

కానీ బాక్సాఫీస్ దగ్గరకి వచ్చాక బాగానే ఉంటుంది కానీ ఎక్కడో ఫేక్ నెస్ కనిపిస్తుంది అని చాలామంది అభిప్రాయం. ఓపెనింగ్స్ వరకు ఓకే కానీ లాంగ్ రన్ లో విజయ్ సినిమాలు 300 కోట్లు కొట్టినవి కూడా ఉన్నాయి అంటారు. అలాంటి చిత్రాల్లో తన లేటెస్ట్ హిట్ సినిమా “వరిసు” చేరింది.

ఈ సినిమా తెలుగులో వారసుడుగా రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా హిట్ అయ్యింది. అయితే వసూళ్ల పరంగా మాత్రం ఈ సినిమాతో వచ్చిన అజిత్ సినిమా తమిళ్ లో బాగా డామినేషన్ చూపించింది అయినా కానీ విజయ్ సినిమాకి భారీ నెంబర్స్ ఉన్నట్టుగా సినీ వర్గాల్లో ప్రచారాలు జరిగాయి.

ఈరోజు వరిసు సినిమా వరల్డ్ వైడ్ గా 300 కోట్లు గ్రాస్ అందుకొని విజయ్ కెరీర్ లో మరో 300 కోట్ల సినిమాగా నిలిచినట్టుగా అంటున్నారు. దీనితో మరోసారి అంతగా రాణించని సినిమాకి కూడా ఫేక్ నంబర్స్ చేస్తున్నారా అనే అనుమానం మళ్ళీ విజయ్ సినిమాపై మొదలైంది. మరి ఇవన్నీ ఎంతవరకు నిజమో అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించింది.