అనసూయ ఆ కారెక్టర్ చేస్తే ఫ్యాన్స్ గుండెలు బద్దలైపోతాయి మరి.

అనసూయ ఇంతక ముందు బుల్లితెరలో మాత్రమే తన సత్తా చాటింది. కాని గత రెండు మూడేళ్ళుగా బుల్లితెర మీద మాత్రమే కాదు బిగ్ స్క్రీన్ మీద కూడా తన సత్తా ఏంటో చూపిస్తోంది. చెప్పాలంటే అనసూయ కి ఇప్పుడు హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. మంచి కథ దొరికి అనసూయ ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కమిటవ్వాలే గాని ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే అనసూయ కి క్రేజ్ మాత్రమే కాదు తన సినిమాలకి కాస్త మార్కెట్ కూడా బాగానే ఉంది. ఈ మధ్య నిండు గర్భీణి పాత్రలో గొప్ప ఛాలెంజింగ్ రోల్ కూడా చేసింది.

everyones-heart-breaks-if-anasuya-performs-in-that-character
everyones-heart-breaks-if-anasuya-performs-in-that-character

ఇదే కాదు పాత్ర నచ్చాలే గాని అనసూయ ఆ పాత్ర కోసం ఎంతగా కష్టపడుతుందో సుకుమార్ దర్శకత్వంలో రాం చరణ్ – సమంత నటించిన రంగస్థలం సినిమానే ఉదాహరణ. వాస్తవంగా అనసూయ కి రంగస్థలం సినిమా తర్వాత బోలెడు అవకాశాలు వచ్చాయి. కాని ఏది పడితే అది ఒప్పుకోవడం లేదు. కథ లో తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ఒకవైపు ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ తన క్రేజ్ ని మరింత పెంచుకుంటోంది అనసూయ.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప లో కూడా అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాల తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే యాక్షన్ హీరో గోపిచంద్ తో మారుతి తెరకెక్కించనున్న తాజా చిత్రంలో అనసూయ వేశ్య పాత్రలో నటించేందుకు అంగీకరించిందని లేటెస్ట్ అప్‌డేట్. కాగా అనసూయ తన కెరీర్ లోనే ఛాలెంజింగ్ రోల్ చేయబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. కాని ఇంకా అఫీషియల్ గా మేకర్స్ నుంచి కన్‌ఫర్మేషన్ రాలేదు.