పవన్ సరసన నిధి అగర్వాల్ అంటే అందరికీ ఒకే గాని .. వాళ్ళు మాత్రం ..?

క్రిష్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పీరియాడికల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసందే. ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ లో 27 వ సినిమా గా తెరకెక్కుతోంది. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా 15 రోజుల పాటు ఒక షెడ్యూల్ జరిగి ఆగిపోయింది. కాగా లాక్ డౌన్ తర్వాత మళ్ళీ ఈ సినిమా మొదలవ్వాల్సి ఉండగా అనూహ్యంగా పవన్ కళ్యాణ్ అయ్యప్పనం కోషియం రీమేక్ కమిటయ్యాడు.

Pawan Kalyan And Director Krish To Collaborate For PSPK27 - Sacnilk

దాంతో క్రిష్ – పవన్ కళ్యాణ్ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయిందన్న వార్తలు వచ్చాయి. కాని డిసెంబర్ నుంచి క్రిష్ ఈ సినిమాని పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. పవన్ కళ్యాణ్ లేకుండా కూడా సినిమాలోని కీలకమైన సీన్స్ ని కంప్లీట్ చేయాలని షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి కూడా వీలున్నప్పుడు 2-3 రోజులు డేట్స్ సర్ధుబాటు చేసేలా కూడా రిక్వెస్ట్ చేశాడ క్రిష్.

ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ గా ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధీ అగర్వాల్ ని తీసుకునే ఆలోచనలో క్రిష్ ఉన్నాడట. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా ఒకే అన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఈ సినిమాకి నిధి ఫైనల్ చేసినట్టే అని త్వరలో షూటుంగ్ మొదలైతే నిధి సెట్ లో అడుగుపెడుతుందని అంటున్నారు. ఇదే గనక నిజమైతే నిధి ఖచ్చితంగా ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాలో జాక్విలిన్ ఫెర్నాండస్ నటిస్తుందని సమాచారం. అంటే నిధీ సెకండ్ లీడ్ కావచ్చు అంటున్నారు. చూడాలి మరి మేకర్స్ అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తారో. అయితే కొందరు మాత్రం ఈ ఇస్మార్ట్ గ్లామర్ బ్యూటికి పీరియాడికల్ మూవీ అంటే సెట్ అవుతుందా అన్న డైలమాలో ఉన్నారట.