జూలైలో ప్రభాస్ ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా..!

పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “ఆదిపురుష్” రిలీజ్ అయ్యి అయితే వారం రోజులు పూర్తి చేసుకుంది. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా జస్ట్ యావరేజ్ టాక్ తో అయితే ఇప్పుడు దారుణమైన వసూళ్లు చూస్తుంది.

దీనితో ప్రభాస్ ఖాతాలో మరో ప్లాప్ లానే ఉందని అంతా అనుకుంటుండగా ఇక ఫ్యాన్స్ మాత్రం సర్లే పోతే పోయింది. నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి వాటి కోసం చూద్దాం అనుకుంటున్నారు. కాగా ప్రభాస్ నుంచి నెక్స్ట్ ఆదిపురుష్ ని మించి ఎంతో పొటెన్షియల్ ఉన్న రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి “సలార్” కాగా.

మరొకటి “ప్రాజెక్ట్ కే”. ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లు తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రాలు నుంచి అయితే ఈ జూలై లో సాలిడ్ అప్డేట్స్ రాబోతున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి మొదటగా అయితే జూలై 3న యూఎస్ లో గ్రాండ్ ఈవెంట్ తో ప్రాజెక్ట్ కే టైటిల్ ఏంటి అనేది రివీల్ చేస్తారని బజ్ వినిపిస్తూ ఉండగా..

నెక్స్ట్ 7న అయితే సలార్ నుంచి టీజర్ వస్తుందని సినీ వర్గాల నుంచి క్రేజీ టాక్ వినిపిస్తుంది. అయితే డేట్స్ ఏమన్నా మార్పు ఉండొచ్చు ఏమో కానీ జూలై లో మాత్రం ఈ రెండు సినిమాలు నుంచి భారీ అప్డేట్స్ ఖాయం అని సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో అవి గాని నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా ఖాయం అని చెప్పొచ్చు.