Rajamouli: గాలి జనార్దన్ కొడుకు కిరిటీ కోసం రాజమౌళి ఏం చేశారో తెలుసా..?

Rajamouli: ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటీ హీరోగా పరిచయం అవుతున్నాడు. కొత్త హీరోలను పరిచయం చేయడంలో వారహి చలన చిత్రం బ్యానర్ ముందుంటుంది. ఇపుడు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటీని కూడా తెలుగులో హీరోగా పరిచయం. చేయబోతున్నారు. రాధాకృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. కన్నడ, తెలుగు భాషల్లో సినిమా నిర్మించబోతున్నారు. ఇందుకోసం కిరిటీ నటన, డాన్సు, ఫైట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. సినిమా కోసం లావు తగ్గి ఫిట్ గా తయారయ్యాడు. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్, యాక్టర్స్ ను రంగంలోకి దించుతున్నారు. మార్చి 4 శుక్రవారం గ్రాండ్ గా ప్రారంభించారు.

ఈ సినిమా పేరు ఇంకా ఖరారు చేయలేదు. సాయి కొర్రపాటి ఈ సినిమా కోసం భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో జెనిలియా పదేళ్ల తర్వాత మళ్ళీ సౌత్ లో నటించబోతోంది. శుక్రవారం జరిగిన వేడుకకు ముఖ్య అతిధిగా ఎస్ ఎస్ రాజమౌళి విచ్చేసారు. ఇక కర్ణాటక రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ముహూర్తం షాట్ ను రాజమౌళి క్లాప్ ఇవ్వగా, కన్నడ లెజెండ్ డాక్టర్ రవిచంద్ర కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘’కిరీటీని పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా ప్రామిసింగ్‌గా కిరీటీ లుక్స్ వున్నాయి. నటుడికి కావాల్సిన నటన, నృత్యం, ఫైట్స్ తను చేయగలడు. వారాహి చలనచిత్రం బేనర్‌లో ఆయనను చూడటం ఆనందంగా ఉంది. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” అన్నారు. హీరో కిరిటీ మాట్లాడుతూ సినిమాల్లోకి రావడానికి అప్పు సార్(పునీత్ రాజ్ కుమార్ ) నాకు స్ఫూర్తి అని చెప్తూ ఈ సినిమా లో అవకాశం ఇచ్చిన సాయి కొర్రపాటి కి ధన్యవాదాలు, కష్టపడి పని చేస్తానని, అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇస్తానని వాగ్దానం చేసారు.