మొగల్తూరులో కృష్ణంరాజు సంస్కరణ సభ కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా?

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ నెల 11వ తేదీ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ కుటుంబ సభ్యులు ఇంకా ఈ బాధ నుంచి బయటపడలేదు. అయితే కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ తన పెదనాన్నకు చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు సంస్కరణ సభను మొగల్తూరులో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున కృష్ణంరాజు అభిమానులు ప్రభాస్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభాస్ సుమారు 12 సంవత్సరాల తర్వాత మొగల్తూరులో అడుగుపెట్టడంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులతో మొగల్తూరు కిక్కిరిసిపోయింది. అయితే తనని చూడడం కోసం వచ్చిన అభిమానులు ఏ ఒక్కరూ ఆకలితో వెనక్కు తిరిగి వెళ్ళకూడదని భావించిన ప్రభాస్ ఏకంగా 1,50,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయించారు.

ఈ విధంగా కృష్ణంరాజు సంస్కరణ సభ కోసం వచ్చిన వారికి ప్రభాస్ ఏర్పాటు చేయించిన ఆహార పదార్థాల మెనూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంస్కరణ సభ కోసం వచ్చిన వారికి ప్రభాస్ 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు , 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 4 టన్నుల సందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు.. ఇవి కాక మరో 22 రకాల నాన్ వెజ్తయారు చేయించారు వీటన్నింటికీ సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు ప్రభాస్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.