“ఆదిపురుష్” బడ్జెట్ కి ఇప్పుడు డిస్కౌంట్.!

పాన్ ఇండియా సినిమా ఎదురు చూస్తున్న వన్ అండ్ ఓన్లీ చిత్రం ఏదన్నా ఉంది అంటే పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “ఆదిపురుష్” అనే చెప్పాలి. మరి ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా ఈ సినిమాతోనే ప్రభాస్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఐతే ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసిన సమయంలోనే ఏకంగా 1000 కోట్లు కూడా పెట్టడానికి నిర్మాణ సంస్థ టి సిరీస్ వారు సిద్ధంగా ఉన్నారని టాక్ రాగ వారు అప్పుడు 500 నుంచి 600 కోట్లతో అయితే ఈ సినిమాని కంప్లీట్ చేసారని తెలిసిందే. అయితే ఇంత పెట్టి కూడా వరస్ట్ గ్రాఫిక్స్ తో రిలీజ్ చేసిన టీజర్ చూసాక ఒకొక్కరికి గట్టిగా కాలింది.

దీనితో ఈ చిత్రం రిలీజ్ ని ఆపి మళ్ళీ 100 కోట్లు పెట్టి అన్నీ రెడీ చేసి ఎట్టకేలకి జూన్ రిలీజ్ కి అయితే తీసుకొస్తున్నారు. దీనితో ఎలా లేదన్నా ఇప్పుడు 600 కోట్లు అవ్వాలి కానీ ఇప్పుడు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నా సమాచారం అయితే ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లే అని 100 కోట్లు అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు.

అంటే దీనితో సినిమాకి ఆల్రెడీ 423 కోట్లు అలా బిజినెస్ తోనే వచ్చాయి అని స్టార్డం ని ప్రూవ్ చేయడానికి కొన్ని గిమ్మిక్స్ చేస్తున్నారు. అంతలా బడ్జెట్ లు మార్చుకోడం ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇలా చేసుకోడం ఎందుకు చెప్పండి? ఇక ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, కృతి సనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆలాగే ఈ సినిమా ఈ జూన్ 16న రిలీజ్ కాబోతుంది.