Thrivikram Srinivas: రెమ్యూనరేషన్ రెట్టింపు చేసే దిశలో త్రివిక్రమ్….!

Thrivikram Srinivas: 1999లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ లో అంచనాలు మామూలుగా ఉండవు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు అతడు,ఖలేజా చేసిన రచ్చ ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మూడో చిత్రం రాబోతోంది దీంట్లో మహేష్ బాబు కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. దీనిపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.

త్రివిక్రమ్ చేసిన చివరి చిత్రం అలా వైకుంఠపురం, ఇది ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ 25 కోట్ల పారితోషికం తీసుకున్నారట. అలా వైకుంఠపురం ఘన విజయం అవడంతో ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రానికి ఏకంగా పారితోషకాన్ని రెట్టింపు చేశారట. అయితే ఈ సినిమాకి మహేష్ బాబు తీసుకుంటున్న పారితోషకం కూడా 50 కోట్లే నట.

ఇది చూస్తుంటే హీరోతో సమానంగా త్రివిక్రమ్ పారితోషకం ఉందన్నమాట. కాగా మహేష్ బాబు సర్కారీ వారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ కాంబోలో వస్తున్న సినిమా మొదలు అవుతుందట. ఇలా వరుస సినిమాలకు పని చేస్తూ దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ మొత్తంలోనే తదితర చిత్రాలకు రెమ్యూనరేషన్ తీసుకోకున్నారు.