పూజా హెగ్డే గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన డైరక్టర్ తేజ… వైరల్ అవుతున్న కామెంట్స్?

ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో పూజా హెగ్డే నటించిన సినిమాలు అయినప్పటికీ.. ఈమె అందం అభినయంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన డీజే సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్న పూజ హెగ్డే బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటు బిజిగా మారిపోయింది. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా పూజ హెగ్డే హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకుంటుంది.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది. ఇలా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందిన పూజా హెగ్డే గురించి డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన తేజ గత కొంతకాలంగా హిట్టు లేక సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల అహింస సినిమా ద్వారా దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత తీసుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

తొందర్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ద్వారా తేజ మరొకసారి డైరెక్టర్ గా తన ప్రతిభ నిరూపించుకుంటాడో లేదో చూడాలి మరి. ఇదిలా ఉండగా ఇటీవల ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజ హెగ్డే గురించి తేజ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్లలో ఎవరి యాక్టింగ్ అంటే ఇష్టం అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమంత యాక్టింగ్ అంటే ఇష్టమని తేజ సమాధానం చెప్పాడు. ఆ తర్వాత కొందరు పేర్లు చెప్పండి వాళ్ళ గురించి నేను చెబుతాను అని తేజ అడగగా.. రష్మిక మందనతో పాటు పూజా హెగ్డే పేరు చెప్పగానే అసలు పూజా హెగ్డే ఎవరు? అంటూ తేజ ఎదురు ప్రశ్నించారు. అయితే స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయిన పూజ హెగ్డే తెలియదు అని చెప్పటంతో తేజ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.