IPL 2025: IPL ఫైనల్ ఫైట్ ముందు రాజమౌళి స్పెషల్ నోట్.. ఇద్దరికి ముఖ్యమే అంటూ..

ఐపీఎల్ 2025 ఫైనల్ కు కొద్ది గంటలే మిగిలుండగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియాలో తన మనసులోని భావాలను వ్యక్తపరిచారు. తాను అభిమానించే ఇద్దరు కెప్టెన్ల మధ్య జరిగే పోరాటం తనకు ఎంతో వ్యక్తిగతంగా ఉత్కంఠ కలిగిస్తోందని చెప్పారు. ఫలితం ఎలా ఉన్నా.. ఎవరో ఒకరు ఓడిపోవాల్సి రావడం బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాజమౌళి, శ్రేయాస్ అయ్యర్‌ ఆటతీరుపై ప్రత్యేకంగా స్పందించారు. అతని సృజనాత్మక బ్యాటింగ్‌, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించారు. “బుమ్రా, బౌల్ట్ లాంటి టాప్ బౌలర్లను ఎదుర్కొంటూ థర్డ్ మ్యాన్‌కు షాట్లు ఆడే నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయాను,” అని పేర్కొన్నారు. ఢిల్లీ నుండి ప్రారంభమైన అతని ప్రయాణం, కోల్‌కతా విజయం, ఇప్పుడు పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చిన తీరును రాజమౌళి ఎంతో గొప్పగా అభివర్ణించారు. “ఈ యువ నాయకుడు ఎప్పటికీ మర్చిపోలేనివాడు” అని తన అభిమానం చాటారు.

ఇక కోహ్లీ విషయానికి వస్తే, రాజమౌళి మరింత ఉద్వేగంగా స్పందించారు. సంవత్సరాలుగా స్థిరంగా ఆడుతూ, భారత క్రికెట్‌కు పునాదులు వేసిన అతని ప్రదర్శన తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. “కోహ్లీకి ఈ ట్రోఫీ గెలుచుకోవడం చివరి స్వప్నం లాంటిది. ఆ తపనలో అతని కళ్లల్లో ప్రతిరోజూ లక్ష్యం కదలాడుతుంటుంది,” అని వ్యాఖ్యానించారు.

ఇద్దరూ అద్భుతమైన నాయకులు అని స్పష్టం చేసిన రాజమౌళి, విజేత ఎవరు అయినా తన హృదయానికి దగ్గరవారే అవుతారని తెలిపారు. “ఈ ఫైనల్ ఫలితం గుండెను తాకేలా ఉంటుంది. ఎవరో ఓడిపోతారు అనేది నిజం, కానీ ఇద్దరూ గెలిచినట్లే” అంటూ ఈ మ్యాచ్‌ గురించి తన భావోద్వేగాన్ని షేర్ చేశారు.

Dr Askary explained about how to increase sex time and last longer in bed naturally | Telugu Rajyam