చిరంజీవి గిఫ్టుగా ఇచ్చిన ఆ కారు వల్లే ప్రాణాలతో బతికున్నాను: కృష్ణవంశీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇకపోతే గత కొంతకాలం నుంచి వెండితెరకు దూరంగా ఉన్నటువంటి కృష్ణవంశీ తాజాగా రంగమార్తాండ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

రంగ మార్తాండ సినిమా తన కెరియర్లో మనసుపెట్టి చేసిన సినిమా అని ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను సందడి చేస్తుందని కృష్ణవంశీ వెల్లడించారు.ఇకపోతే తనకు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం అని వృత్తిపరంగా వ్యక్తిగతంగాను ఆయన అంటే అభిమానమని కృష్ణవంశీ తెలిపారు. నేను తనని అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటానని ఆయన కూడా నన్ను తమ్ముడిలాగే భావిస్తారని కృష్ణవంశీ తెలిపారు. ఇక నేను ఎంతో కష్ట సమయాల్లో ఉన్నప్పుడు నాకు గోవిందుడు అందరివాడే సినిమా ఇచ్చారని చెప్పుకొచ్చారు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒక యాడ్ చేస్తున్న సమయంలో అన్నయ్య మీకు ఇష్టమైన వారికి ఒక కారు గిఫ్ట్ గా ఇస్తారు? అంటూ తమాషాగా చెప్పాను. ఇలా చెప్పిన కొన్ని రోజులకు ఆయన ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్తే తనకు కార్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు.ఆ మాట విని షాక్ అయిన నేను తను ఇచ్చే బహుమానం తీసుకోవడానికి ఇష్టపడలేదు.అన్నయ్య అని పిలుస్తున్నావు ఈ అన్నయ్య ఇచ్చే బహుమానం తీసుకోవా అంటూ మెగాస్టార్ ప్రశ్నించారు.

అన్నయ్య ఈ విధంగానే అనేసరికి మొహమాటంగానే ఆ కారు తీసుకున్నానని అయితే ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆ కారే కారణమని కృష్ణవంశీ వెల్లడించారు. ఆ కారులో ఓ రోజున నందిగామ వెళ్లి వస్తుండగా పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే కారు బాగా డామేజ్ అయినప్పటికీ తనకు మాత్రం చిన్న చిన్న గాయాలు అయ్యి ప్రాణాలతో బయటపడ్డానని ఆ కారే నాప్రాణాలు నిలబెట్టిందని ఈ సందర్భంగా కృష్ణవంశీ గతంలో జరిగిన ఓ సంఘటన గురించి బయట పెట్టారు.