దిల్ రాజు భారీ చిత్రాల లైన్ అప్

టాలీవుడ్ బడా నిర్మాతగా సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తున్న నిర్మాత దిల్ రాజు. దిల్ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన దిల్ రాజు ప్రస్తుతం శాకుంతలం సినిమా వరకు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే దిల్ రాజు ప్రస్తుతం రెండు ప్రొడక్షన్ హౌస్ లు నడుపుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ పేరుతో బ్యానర్ 2 స్టార్ట్ చేసి దానిలో మొదటి చిత్రంగా బలగం సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా 25 కోట్ల వరకు బలగం సినిమా కలెక్షన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఇకపై మెజారిటీ పాన్ ఇండియా లెవెల్ భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే వస్తాయని ఇదివరకే దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ 1 నుంచి రాబోతున్న సినిమాల లైనప్ చూసుకుంటే చాలా గ్రాండ్ గా ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాను 200 భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, బాబీ కాంబినేషన్ ఒక సినిమా ఉంది.

అయితే అది స్టార్ట్ అయ్యేసరికి టైం పట్టొచ్చు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పౌరాణిక కథాంశంతో ఒక సినిమా సెట్ అయ్యింది. ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి మరో మూడేళ్ల సమయమైనా పట్టొచ్చు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఒకటి చేయాల్సి ఉంది.

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో జఠాయు, లేదంటే శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వంభర స్క్రిప్ట్ లలో ఒకటి తారక తో స్టార్ట్ అవ్వొచ్చని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ కూడా చర్చల దశలో ఉందంట. మొత్తానికి దిల్ రాజు ఒక అరడజను ప్రాజెక్ట్ ల వరకు పాన్ ఇండియా లెవెల్ కథలతో లైన్ లో పెట్టారు. వీటిలో ఏవి ముందు స్టార్ట్ అవుతాయి. ఏవి తరువాత మొదలవుతాయి అనేది వేచి చూడాలి