“వారుసుడు” విషయంలో విజయ్ ని అవమానించిన దిల్ రాజు?

ప్రస్తుతం సౌత్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా మారిన భారీ చిత్రం “వారసుడు”. తమిళ స్టార్ నటుడు విజయ్ దళపతి నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా అయితే ఇప్పుడు తమిళ్ లో కూడా హాట్ టాపిక్ గా ఎక్కువ కాంట్రవర్సీ లతో నడుస్తుంది.

లేటెస్ట్ గా దిల్ రాజు ఈ సినిమా విషయంలో అజిత్ ని తక్కువ చేసి మాట్లాడ్డం పెద్ద సంచలనంగా మారగా వారసుడు సినిమాపై అయితే ఓ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ కూడా ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ చిత్రం అయితే మొదట తాము విజయ్ కి చెప్పలేదని దిల్ రాజు చెప్పాడు.

ఈ సినిమా కథ వంశీ తనకి చెప్పగానే నచ్చి మొదట మహేష్ తో చేయాలని అనుకున్నామని కానీ మహేష్ వేరే సినిమాల్లో బిజీగా ఉండడంతో చేయలేదని తెలిపాడు. అలాగే నెక్స్ట్ చరణ్ కూడా నరేట్ చేయగా తాను కూడా బిజీ ఉన్నాడని తెలుగులో అయితే చాలా మంది స్టార్స్ ను అనుకుంటే అందరూ బిజీగా ఉండగా ఎవరూ ఖాళీ లేరని.

అప్పుడు విజయ్ కి ఈ కథ చెప్తే అప్పుడు తాను ఓకే చేసారని అలా ఈ సినిమా విజయ్ దగ్గరకి వెళ్ళింది అని తెలిపాడు. అయితే ఇది ఎవరూ ఖాళీగ లేరని విజయ్ ని తీసుకున్నాం అన్నట్టుగా చెప్పడం కాస్త అవమానించినట్టే అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ సినిమా విషయంలో అంశాలు పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి.