“వారసుడు” పై కీలక క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.!

వచ్చే ఏడాది టాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్న పలు భారీ అవైటెడ్ చిత్రాల్లో సంక్రాంతికే అనేక సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ చిత్రాల్లో అయితే తమిళ సహా తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్న చిత్రం “వారసుడు” కూడా ఒకటి. దర్శకుడు వంశీ పైడిపల్లి తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో చేసిన ఈ సినిమా తమిళ్ లో “వరిసు” పేరిట తెరకెక్కి ఇప్పుడు అయితే రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ఇక ఈ అవైటెడ్ సినిమా తాలూకా మొదటి ఆడియో ఈవెంట్ నిన్ననే తమిళ్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో ఈ సినిమా నిర్మాత కొన్ని కీలక కామెంట్స్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా పోస్టర్స్ అవన్నీ చూసి కొంతమందికి మహర్షి సినిమా గుర్తొచ్చింది మరికొందరికి మరిన్ని సినిమాలు గుర్తొచ్చాయి.

దీనితో రీమేక్ అనే మాట గట్టిగా స్ప్రెడ్ కాగా దీనిపై అయితే దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం ఏ సినిమాకి కూడా రీమేక్ కాదు అలాగని సీక్వెల్ కూడా కాదు పూర్తిగా కొత్త సబ్జెక్టు అని తాను అయితే క్లారిటీ ఇచ్చారు. దీనితో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో కూడా పెద్ద క్లారిటీ వచ్చింది అని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే జనవరి 12న తెలుగు తమిళ్ సహా హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.