హీరోయిన్ మహేశ్వరికి ఆ హీరోతో ఎఫైర్ నడిచిందా.. ఇందులో నిజమెంత?

సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో లేదా హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక రెండు మూడు సినిమాలలో నటిస్తే చాలు వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి. వారి మధ్య ఎలాంటి భావన లేకపోయినా వీరి గురించి పలు రకాల వార్తలను రాస్తూ పెద్ద ఎత్తున పుకార్లు పుట్టిస్తుంటారు. ఈ క్రమంలోనే అలనాటి హీరో హీరోయిన్ల నుంచి నేటి హీరో హీరోయిన్ల వరకు కూడా ఈ విధమైనటువంటి పుకార్లు రావడం సర్వసాధారణం అయితే ఇండస్ట్రీలో అతిలోకసుందరి శ్రీదేవి కజిన్ సిస్టర్ గా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మహేశ్వరి గురించి అందరికీ సుపరిచితమే.

దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు తమిళ కన్నడ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేశ్వరి అమ్మాయి కాపురం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక ఈమెకు గులాబీ సినిమా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఇలా తెలుగు తమిళ హిందీ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన మహేశ్వరి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు.

ఇకపోతే మహేశ్వరి జయ కృష్ణన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇకపోతే ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈమె ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తితో రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు షికారులు చేశాయి.ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ ఇద్దరు కలిసి ఏకంగా మూడు సినిమాలలో నటించడంతో వీరి గురించి ఇలాంటి వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పట్లో వీరిద్దరు కూడా ఎంతో చనువుగా ఉండడంతో ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి.