భార్యపై కోపంతో కన్నబిడ్డలను కిరాతకంగా చంపి.. ఆత్మహత్య చేసుకున్న తండ్రి?

భార్య భర్తలు అన్న తర్వాత వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని చర్చించుకుంటే సమస్యలు సర్డుమనుగుతాయి. కానీ మొండిగా ప్రవర్తిస్తూ చిన్న గొడవలను కూడా పెద్దవి చేసి ఒకరికొకరు దూరం అవుతున్నారు. ఈ క్రమంలో వారి పిల్లలు కూడా అనాధలుగా మారుతున్నారు. తల్లిదండ్రుల మధ్య ఉన్న మనస్పర్ధలు కారణంగా అపం శుభం తెలియని చిన్నారులు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల నాగర్ కర్నూలులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల కారణంగా ఒక తండ్రి తన పిల్లలను గొంతు కోసి హత్య చేసి ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాలలోకి వెళితే…కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామానికి చెందిన ఓంకార్ , మహేశ్వరి దంపతులు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురూ చందన (9), తో పాటు తొమ్మిది నెలల విశ్వనాథ్ కూడా ఉన్నారు. అయితే భార్య భర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా రోజు గొడవ జరిగేది. అయితే ఈ గొడవల వల్ల మనస్థాపం చెందిన ఓంకార్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఇటీవల తన ఇద్దరు పిల్లలను తీసుకొని ద్విచక్రవాహనంపై ఎత్తం గ్రామ శివారులోని అడ్డగుట్టల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో మొదట కూతురి గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తొమ్మిది నెలల కుమారుడిని కూడా ఇదే విధంగా గొంతు కోసి హత్య చేసి ఆ తర్వాత తాను కూడా గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియచేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలంలో పరిశీలించి ముగ్గురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికీ చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ క్రమంలో భారీ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.