“మళ్లీ పెళ్లి” కేసుపై కీలక తీర్పు ఇచ్చిన కోర్ట్.!

గత కొన్ని నెలల కితం టాలీవుడ్ లో సెన్సేషనల్ చేసిన సీనియర్ జంట ఎవరైనా ఉన్నారు అంటే అది సీనియర్ స్టార్ నటుడు నరేష్ అలాగే ప్రముఖ నటి పవిత్ర లోకేష్ లు అని చెప్పాలి. కాగా ఈ ఇద్దరు బహిరంగం గానే తన బంధాన్ని ఎక్స్ పోజ్ చేయడం అలాగే అంతకు ముందు నరేష్ భార్య విషయంలో కూడా పలు కాంట్రవర్సీ లు నడవడం అనేది సెన్సేషన్ గా మారింది.

ఇక ఇదే కోణంలో నరేష్ నిర్మాణం వహించిన సినిమానే “మళ్ళీ పెళ్లి”. కాగా ఈ చిత్రం విషయంలో నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి అయితే ఆమె పాత్రని కించపరిచేలా చూపించారు అని సినిమాని థియేటర్స్ లో అలాగే ఓటిటి లో కూడా రిలీజ్ చేయకూడదు అని కేసు వేశారు.

అయితే అప్పటికీ థియేటర్స్ లోకి వచ్చేసిన ఈ చిత్రం డీసెంట్ రన్ ని కూడా చూసేసింది. తర్వాత ఓటిటి లో కూడా రిలీజ్ కాగా ఈ సినిమా తర్వాత కేసు మూలాన ఓటిటిలో తొలగించబడింది. అయితే ఫైనల్ గా ఇప్పుడు నరేష్ కి ఫెవర్ గా సివిల్ కోర్టు తీర్పుని ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి.

రమ్య వేసిన కేసులో నిలకడ లేదు అని సినిమాకి ఆమెకి కూడా ఎలాంటి సంబంధం లేదని రుజువు అయింది అని పైగా ఇక ఆమె నరేష్ ఇంటికి వెళ్లి గాని ఇంకెక్కడైనా తనని ఇబ్బంది పెట్టకూడదు అని రివర్స్ లో ఆమెకే కౌంటర్ ఇచ్చింది. పైగా సినిమాని అడ్డుకునే హక్కు ఏ ప్రయివేట్ వ్యక్తికి కూడా లేదు అని సూచినినట్టుగా తీర్పులో తెలుస్తుంది.