వైరల్ : “ఆదిపురుష్” కోసం మెగాస్టార్ చెప్పిన మాట.!

ఇప్పుడు పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “ఆదిపురుష్” విడుదల జస్ట్ మరికొన్ని రోజుల్లోనే ఉంది. మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమాని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా నిన్ననే తిరుపతి లో బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే జరిగింది.

కాగా ఈ మాసివ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సహా చిన జీయర్ స్వామి ప్రత్యేక అతిధిగా రాగా ఈ సినిమా కోసం వారంతా అనేక ప్రత్యేక మాటలు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ వచ్చిన సమయంలో అయితే టాలీవుడ్ నుంచి అనేకమంది సినీ ప్రముఖులు మాట్లాడలేదు.

ఎవరో కొందరు ప్రభాస్ కి ఫ్రెండ్స్ లాంటి వారు మాట్లాడారు తప్ప మేజర్ టాలీవుడ్ స్టార్స్ ఎవరూ ఈ సినిమా కోసం మాట్లాడింది. లేదు. అయితే వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నప్పటికీ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ప్రభాస్ మెగాస్టార్ కోసం చెప్పిన మాట ఇపుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

ఈ సినిమా చేస్తున్నానని చిరంజీవి గారు అడిగారని. ఏంటి రామాయణం మీద సినిమా చేస్తున్నావా? అది చాలా అదృష్టం ఎవరికో గాని రాదు జాగ్రత్తగా చేయాలి అంటూ ఆయన నాకు చెప్పారని ప్రభాస్ నిన్న ఈవెంట్ లో చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది.

దీనితో చిరు ప్రభాస్ సినిమా విషయంలో ఆ రకంగా సైలెంట్ గా ఉన్నా ప్రభాస్ ని సినిమా జాగ్రత్తగా చెయ్యమని అయితే సూచించడం ఆసక్తిగా మారింది. కాగా ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ కృతి సనన్ లు కీలక పాత్రల్లో నటించగా ఈ జూన్ 16న థియేటర్స్ లో ఈ సినిమా పడనుంది.