‘భోళా శంకర్’.! మొత్తం మార్చేశారంట కదా.!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. కోల్‌కతా అంటే, మెగాస్టార్ చిరంజీవికి ఫేవరెట్ డెస్టినేషన్.. సినిమాల పరంగా.!

‘చూడాలని వుంది’ సినిమాలోని ‘యమహానగరి..’ అంటూ సాగే పాట అప్పటికీ ఇప్పటికీ ఓ క్లాసిక్.! అలాంటి పాటని ఇంకోసారి ‘భోళా శంకర్’ సినిమాలో చూడబోతున్నామా.?

ఏమోగానీ, ఇది ‘వేదాలం’ సినిమాకి తెలుగు రీమేక్. తమిళ:లో అజిత్ హీరోగా తెరకెక్కింది ‘వేదాలం’. తొలుత, పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాని తెరకెక్కించాలనుకున్నారు. అనూహ్యంగా అది చిరంజీవి చేతికి వచ్చింది.

పేరుకే రీమేక్.. ‘వేదాలం’ సినిమాకి చాలా మార్పులు చేశారట.. అలా ‘భోళా శంకర్’ దాదాపు కొత్త కథ లాంటిదేనని అంటున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ఈ సినిమాకి మరిన్ని మార్పులు జరిగినట్లు, జరుగుతున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తోందీ సినిమాలో.!