బోయపాటి శ్రీను కి ఇది బంగారం లాంటి అవకాశమే ..మెగా హీరోతో సినిమా అంటే ఆ రేంజ్ వేరే ..!

బోయపాటి శ్రీను సినిమా అంటే హీరో ఎంత హై ఓల్టేజ్ లో కనిపిస్తాడో అందరికీ తెలిసిందే. హీరో ఎవరైనా తన మార్క్ ఎలివేషన్ తో భారీగా క్రేజ్ తీసుకు వస్తాడు. ముఖ్యంగా బోయపాటి శ్రీను తెరకెక్కించే యాక్షన్స్ సీన్స్ .. పవర్ ఫుల్ డైలాగ్స్ కి థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. అభిమానులకైతే ఉత్సాహం రెట్టింపు అయి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే బోయపాటి శ్రీను మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో తీసిన గత చిత్రం వినయ విధేయ రామ భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో బోయపాటి కి చిన్న గ్యాప్ వచ్చింది.

కాని ఆ గ్యాప్ భారీ హిట్ తో ఫిల్ చేయబోతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ తో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ని తెరకెక్కిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ – పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మే 28 న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య క్రాక్ సినిమాతో హిట్ కొట్టి ఫాం లోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. అయితే బోయపాటి నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను నెక్స్ట్ సినిమా మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ .. దేవ కట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత సుకుమార్ సొంత బ్యానర్లో సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ రెండు సినిమాల తర్వాత సాయిధరమ్ తేజ్ – బోయపాటి శ్రీను కాంబోలో సినిమా ఉండబోతోందని సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు.