Prabhas:ప్రభాస్ పూజ హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. అభిమానులు ప్రభాస్ నుంచి మాస్ ఎంటర్టైనర్ని ఆశిస్తున్నారు. కాగా రాధేశ్యామ్ సినిమా స్లో లవ్ స్టోరీ గా రావడంతో అభిమానుల అంతగా ఆదరించ లేకపోయారు. రాధేశ్యామ్ సినిమా తరువాత ప్రభాస్ సలార్,ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటితో పాటు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు.
ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలోనే తీయాలి. అందుకు తగినట్టు నటీనటుల్ని సాంకేతిక నిపుణుల్నీ ఎంచుకోవాలి. దీని కోసం మారుతి పాన్ ఇండియా స్టార్స్ నీ దిగుమతి చేసుకునే ప్రయత్నం లో ఉన్నాడట. ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం బొమన్ ఇరానీ సంప్రదిస్తున్నట్లు సమాచారం.మరో పాత్ర కోసం తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబుని తీసుకొచ్చారని తెలుస్తోంది.
యోగిబాబు ఇప్పటి వరకూ నేరుగా ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. బొమన్ ఇరానీ యోగి బాబు వీరిద్దరూ ప్రభాస్ మారుతి సినిమాలో నటించడం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మారుతి కామెడీ టైమింగ్ కి యోగి బాబు లాంటి వాళ్లు తోడవ్వడం వలన ఆ సన్నివేశాలు మరింత బాగా వస్తాయని భావిస్తున్నారు.వీళ్లే కాకుండా మారుతి సినిమాల్లో రెగ్యులర్గా కనిపించే రావు రమేష్, ప్రవీణ్, సప్తగిరి, వెన్నెల కిషోర్.. వీళ్లంతా కనిపించబోతున్నారు.